ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ స్కూల్స్ విషయంలో ఏపీ సర్కార్ నాడు నేడు కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తుంది. భారీగా నిధులను కేటాయించడమే కాదు దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడం విద్యార్ధులకు అవగాహన కల్పించడం వంటివి జరుగుతున్నాయి. అయితే దీనిపై మాత్రం విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. 

 

తాజాగా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ స్కూళ్లలో నాడు-నేడు కార్యక్రమాన్ని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మెచ్చుకున్నారని ఆయన ట్వీట్ చేసారు. ప్రస్తుతం ఆయన ప్రభుత్వ పదవిలో ఉన్నా జర్నలిస్టుగా 30 సంవత్సరాలు దేశమంతా పర్యటించిన వ్యక్తి అని అన్నారు. విద్యారంగ సంస్కరణలపై ఎంతో అవగాహన ఉంది. ఎల్లో మీడియాకు ఇదేమీ కనిపించడం లేదని ఆయన మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: