ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అధికార పార్టీ నేతలు కరోనా దెబ్బకు భయపడుతున్నారు. కరోనా పేరు వింటే చాలు వారి వెన్నులో వణుకు పుడుతుంది. తాజాగా హైదరాబాద్ వెళ్లి వచ్చిన వైసీపీ నేత ఒకరికి  ఉత్తరాంధ్ర లో కరోనా సోకింది. విజయనగరం జిల్లాకు చెందిన ఒక మంత్రి గారి మేనల్లుడు కరోనా బారిన పడ్డారు అనే వార్తలు వస్తున్నాయి. 

 

కరోనా పరిక్షలు చేయడంతో ఆయనకు కరోనా ఉంది అని వెల్లడి అయింది. ఒక అత్యవసర పని మీద ఆయన హైదరాబాద్ వెళ్ళారు అని అక్కడ ఆయనకు కరోనా వచ్చి ఉండవచ్చు అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయనను విశాఖలో ఒక ప్రముఖ ఆస్పత్రిలో ఉంచి చికిత్స చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆయన ఆరోగ్య౦ నిలకడగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: