లాక్ డౌన్ లో ఆర్ధిక ఇబ్బందులా లేక మరో కారణమా అనేది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి గాని... దేశంలో పలు ప్రాంతాల్లో గృహ హింస అనేది ఎక్కువగా ఉంటుంది. కుటుంబ కలహాలు ఇప్పుడు ప్రజలను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లో ఒక విషాదకర సంఘటన చోటు చేసుకుంది. భర్త వేధింపులు తట్టుకోలేక  భార్య ఆత్మహత్య చేసుకుంది. 

 

హైదరాబాద్ లో తన భర్త వేధింపుల కారణంగా 31 ఏళ్ల మహిళ ఆత్మహత్య చేసుకుందని పోలీసులు పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసామని ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పి. విజయ్ కుమార్ మీడియాకు వివరించారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు అని సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: