ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి గాని తగ్గడం లేదు. ప్రధానంగా  కృష్ణా గుంటూరు కర్నూలు జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఉభయగోదావరి జిల్లాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా గుంటూరు మిర్చి యార్డును మరోసారి కరోనా కారణంగా అధికారులు మూసి వేసారు. 

 

మిర్చి యార్డులో ముగ్గురు వ్యాపారస్థులకు కరోనా పాజిటివ్ వచ్చిన నేపధ్యంలో మూడు రోజుల పాటు యార్డ్ ని మూసి వెయ్యాలి అని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ఒక్క రోజు కొనుగోలు అమ్మకాలు ఆపేస్తే శనివారం ఆదివారం యార్డ్ ఉండదు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇప్పటికి మిర్చి యార్డ్ లో శానిటేషన్ కార్యక్రమాలు పూర్తి చేసారు అక్కడి అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: