ఆంధ్రప్రదేశ్ లో రైతులు అందరికి కూడా ఉచితంగా బీమా అందిస్తామని సిఎం వైఎస్ జగన్ అన్నారు. రైతులకు గత ప్రభుత్వ పంట బీమా బకాయిలను ఏపీ సర్కార్ విడుదల చేసింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రైతు వేసిన పంటకు కనీస గిట్టు బాటు ధర కల్పిస్తామని అన్నారు. రైతులకు ఉచితంగా పంటల బీమా పథకం అందిస్తామని వివరించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్ని విధాలుగా తాము అండగా ఉంటామని అన్నారు. 

 

గత ప్రభుత్వ తీరుతో చాలా వరకు రైతులు ఇబ్బంది పడ్డారని ఆయన అన్నారు. రైతు భరోసా కేంద్రాల నుంచి పంటల విషయంలో సూచనలు సలహాలు అందిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో  మంత్రి కన్నబాబు తో పాటుగా మరి కొంత మంది అధికారులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: