కరోనా వైరస్ నుంచి రక్షించుకోవాలి అంటే వ్యాక్సిన్ వచ్చే వరకు భౌతిక దూరం ఒకటే మార్గం అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కాసేపటి క్రితం జాతిని ఉద్దేశించి మాట్లాడిన ఆయన... ప్రజలు అందరికి కూడా ఇప్పుడు వ్యాక్సిన అవసరం ఎంతో ఉంది అని కాని ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి మనం సామాజిక దూరం తో పాటుగా మాస్క్ లను ధరించాలని అన్నారు. 

 

మాస్క్ లు ధరించాల్సిన రోజు ఒకటి వస్తుంది అని అనుకోలేదని అన్నారు. కరోనా వైరస్ ని జయిస్తామని ఆ నమ్మకం తనకు ఉందని మోడీ అన్నారు. ప్రజలు ఎవరూ కూడా భయపడవద్దు అని అందరూ కలిసి కట్టుగా కరోనా వైరస్ మీద పోరాటం చెయ్యాలి అని మోడీ సూచనలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: