దేశంలో ఏ దుర్మూహూర్తంలో కరోనా వైరస్ మొదలైందో కానీ మనిషికి కంటిమీద కునుకు లేకుండా పోయింది. పేదా.. ధనిక అనే తేడా లేదు.. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరినీ కరోనా చుట్టేస్తుంది. కరోనా భయంతో కొంత మంది ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. కరోనా వ్యాధి వస్తే క్వారంటైన్ కి పంపుతారన్న భయంతో కొంత మంది పారిపోతున్నారు. తాజాగా కరోనా వైరస్ సోకిందనే మనస్థాపంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది.
కుటుంబ సభ్యులందరికి వ్యాధి సోకిందనే బాధతో ఈ దారుణానికి ఒడిగట్టింది. బెంగుళూరులోని కోవిడ్ ఆస్పత్రి వార్డులోని మరుగుదొడ్డిలో ఇది చోటు చేసుకుంది. రాజగోపాల్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు కరోనా సోకింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు పరీక్షలు చేయగా.. ఆమె అల్లుడు, మనవరాలికి కూడా పాజిటివ్ వచ్చింది. వీరందరిని కోవిడ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ క్రమంలో ఒత్తిడికి గురైన ఆమె ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం ఉదయం ఆమె అల్లు వార్డులోకి రాగా బెడ్పై కనిపించలేదు. ఈ విషయంపై ఆరా తీయడంతో వాష్ రూంలో శవం కనిపించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.