టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ పై విమర్శలు చేశారు. జగన్ పేరును ప్రస్తావించకుండానే రాష్ట్రానికి ఒక కంపెనీ తీసుకురావడం అంటే పంచాయతీ భవనాలకు పార్టీ రంగులు వేసుకున్నంత ఈజీ కాదని అన్నారు. రికార్డ్ టైం లో కంపెనీలు ఏర్పాటు కావాలన్నా, నిరుద్యోగ యువత కి ఉద్యోగాలు కల్పించాలన్నా, అది చంద్రబాబుకు మాత్రమే సాధ్యం అని అన్నారు. 
 
టిడిపి హయాంలో కంపెనీ ఏర్పాటుకి ముందుకు వచ్చి, తొలిదశలో రూ.3,800 కోట్ల పెట్టుబడి పెట్టి, ఈరోజు తొలి టైర్ ని విడుదల చేసిన అపొలో టైర్స్ ను అభినందిస్తున్నానని తెలిపారు. కంపెనీ మరింత వృద్ధిచెంది ఆంధ్రరాష్ట్ర యువతకి మరిన్ని ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. మరోవైపు నెటిజన్లు మాత్రం లోకేష్ కామెడీ ట్వీట్లు చేస్తున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: