ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతలను కరోనా వైరస్ బాగానే కంగారు పెడుతుంది. తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్యే కి కరోనా సోకింది. కర్నూలు జిల్లా ఎమ్మెల్యే ఒకరికి కరోనా సోకింది అని అధికారులు ప్రకటించారు. కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్కు గురువారం కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని అధికారులు పేర్కొన్నారు.
ఆయన రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధ పడుతూ హోమ్ క్వారంటైన్లో ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. ఇక తెలంగాణాలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు ప్రజాప్రతినిధుల్లో బయటపడుతున్నాయి. విజయనగరం జిల్లా వైసీపీ ఎమ్మెల్యే ఒకరికి కరోనా సోకిన సంగతి తెలిసిందే.