ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు 11 వేలు దాటాయి. రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు ప్రతీ రోజు నమోదు అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో నేడు 600 కేసులకు పైగా నమోదు అయ్యాయి. ఇక  మరణాలు కూడా నమోదు అయ్యాయి భారీగానే. గత 14 గంటలలో 605 కరోనా కేసులు నమోదు అయ్యాయి అని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

 

యాక్టివ్ కేసులు 6 వేల 147 ఉన్నాయి అని తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. గత 24 గంటల్లో 10 మంది కరోనా వైరస్ కారణంగా మరణించారు. ఇప్పటి వరకు కరోనా కారణంగా 146 మంది మరణించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు 11 వేల 489 కి చేరుకున్నాయి. కోలుకున్న వారు 5 వేల 196 మంది అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: