కరోనా కేసులు ఏమో గాని హైదరాబాద్ లో భారీ మార్కెట్ అంతా కూడా దాదాపుగా నాశనం అయిపోతుంది. అక్కడ రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా హైదరాబాద్ లో దాని పని అది చేస్తుంది. పాతబస్తీలో కరోనా వైరస్ రోజు రోజుకు పెరుగుతున్నాయి. 

 

దీనితో అక్కడి వ్యాపారులు వ్యాపారాలు చెయ్యాలి అంటే భయపడుతున్నారు. చార్మినార్ సమీపంలోని లాడ్ బజార్ మర్చంట్ అసోసియేషన్ తరఫున స్వచ్ఛందముగా 15 రోజులపాటు దుకాణాలను మూసివేయాలని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు. చార్మినార్ చుట్టూ ఉన్న ఇస్లామిక్ బుక్స్ షాపు యజమానులు కూడా లాక్ డౌన్ ని ప్రకటించారు. ఎప్పుడు సందడి సందడి గా ఉండే ఆ ప్రాంతం ఒక్కసారిగా బోసిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: