ఆంధ్రప్రదేశ్ లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారాన్ని అధికార వైసీపీ  ఇప్పట్లో వదిలే వకాశాలు కనపడటం లేదు. అధికార పార్టీ నేతలు ఒకరి తర్వాత ఒకరు నిమ్మగడ్డ ను పదే పదే టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఎమ్మెల్యే ఆర్కే రోజా కూడా విమర్శలు చేసారు. ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాలు అంటూ మాట్లాడారు ఆమె. 

 

తమ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్రలు చేస్తున్నారు అని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపణలు చేసారు. రాజ్యాంగ బద్ద పదవుల్లో ఉండాల్సిన వ్యక్తులు కుట్రలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. 3 లక్షల కోట్లతో తండ్రీ కొడుకులు రాష్ట్రాన్ని దోచుకున్నారు అని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో కాపులకు సిఎం జగన్ చెప్పిన దానికంటే ఎక్కువే చేసారని ఆమె అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: