ఆంధ్రప్రదేశ్ ని మరో బీహార్ మాదిరిగా మార్చేసారు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని అన్నారు. ఇసుక దందా బయటపెడితే కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. జగన్ సర్కార్ ను బాహుబలి లా ఎదుర్కొంటున్నారు అని కేసులు మోపారన్నారు. 

 

కావాలి అనే ఈఎస్ఐ స్కాం లో అచ్చెన్నను ఇరికించారు అని ఆయన ఆరోపించారు. టీడీపీ ని లేకుండా చేయడం ఎవరికి సాధ్యం కాదని అన్నారు. ఇసుక దందా పై ప్రశ్నిస్తే కూన రవి కుమార్ పై కేసులు పెట్టారని అన్నారు. టీడీపీ నేతలపై దాడులు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. మాన్సాస్ ట్రస్ట్ నుంచి అశోక గజపతి రాజుని బయటకు పంపించారని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: