కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేసారు. గాల్వాన్‌ సంఘటనలో వీర మరణం పొందిన సైనికుల గౌరవార్థం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించారు. చైనా గనక భారత భూభాగాన్ని ఆక్రమించలేదన్న మాటే నిజమైతే అసలు 20 మంది భారత సైనికులు ఎందుకు అమరులయ్యారో చెప్పాలని ఆమె ప్రధాని నరేంద్ర మోడిని నిలదీశారు. 

 

భారత భూభాగంలోకి ఎవరూ చొరబడలేదని ప్రధాని మోదీ ప్రకటించారన్న ఆమె... కాని... ఉపగ్రహ చిత్రాలను చూసిన నిపుణులు మాత్రం చైనా దళాలు చొరబడినట్లు చెప్పారని ఆమె ఆరోపించారు. లడఖ్ లో చైనా ఆక్రమించుకున్న భారత భూభాగాన్ని ఎప్పుడు, ఎలా తిరిగి తీసుకొస్తారో చెప్పాలని ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు.  ఆమె కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ విషయంలో మాత్రం కేంద్రం భారత జవాన్లకు సంపూర్ణ మద్దతు ప్రకటించాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: