బిజెపి రాజ్యసభ ఎంపీ... జీవిఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీకి రాజకీయంగా 4 గ్రహణాలు పట్టాయని ఆయన వ్యాఖ్యలు చేసారు. ఎన్టీఆర్‌, చంద్రన్న, వైఎస్సార్‌, జగనన్న.. వీరేనా మహానాయకులు? అని ఆయన నిలదీశారు. దేశంకోసం ప్రాణాలు అర్పించిన ప్రకాశం పంతులు, కందుకూరి వీరేశలింగం కనిపించరా అంటూ ప్రశ్నించారు. కుటుంబ రాజకీయాల కోసం ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేసారు. 

 

రెండు ప్రాంతీయ పార్టీల వల్ల రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందని మండిపడ్డారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడతామని అధికారంలోకి వచ్చిన వైసీపీ ఆ దిశగా చర్యలు చేపట్టలేదని ఆయన మండిపడ్డారు. ఇసుక మాఫియా పేరుతో దోచుకుంటున్నారని ఆరోపించారు. అవినీతి నిర్మూలన అనేది రాజకీయ కోణంలోనే వాడుకుంటున్నారని అన్నారు ఆయన. రాష్ట్రంలో కుల పోరాటాలు మాత్రమే ఉన్నాయని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: