ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ పై కరోనా దెబ్బ ఒక రేంజ్ లో పడింది. మైదానాల్లో ఆటగాళ్ళు ఆడాలి అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. చాలా మంది అసలు బయటకు కూడా రాలేని పరిస్థితి నెలకొంది అని చెప్పాలి. రోజు రోజుకి కరోనా కేసుల తీవ్రత పెరుగుతూ పోతుంది. దీఇతో క్రికెట్ మ్యాచులను నిర్వహించడం అనేది సాధ్యం కావడం లేదు.
తాజాగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. డైనమోస్ క్రికెట్తో పాటుగా జాతీయ క్రికెట్ మ్యాచ్లను రద్దు చేసింది. కరోనా తీవ్రత నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటన చేసింది. జులై 4 నుంచి క్రికెట్ను కొనసాగించేందుకు కృషి చేస్తున్నామని వివరించింది. 2020 క్రికెట్ సీజన్లో ఇప్పటికే షెడ్యూల్ చేసిన మ్యాచ్లను నిర్వహించలేకపోతున్నందుకు బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది.