తెలంగాణ ప్రభుత్వం పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలను నిర్వహించడంపై ఇప్పుడు విపక్షాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేసారు. పీవీ ఒక విజ్ఞాన గని అని, ఆయనను రాజకీయంగా చూడకూడదు అని వ్యాఖ్యానించారు. తన పరిధిలో లేని అంశాలపై కేసీఆర్ గొప్పగా చెబుతున్నాడన్నారు ఆయన. 

 

ఇక ఈ సందర్భంగా పీవీపై నిజమైన ప్రేమ ఉంటే తన పరిధిలో ఉన్న అంశాలపై నిర్ణయం తీసుకోవాలి అని సూచించారు. రైతు బంధు పథకానికి అలాగే వరంగల్ అర్బన్ జిల్లాకు పీవీ పేరు పెట్టాలని ఆయన కేసీఆర్ కి సూచించారు. ఒక యూనివర్సిటీకి పీవీ పేరు పెట్టడంతో పాటు ఆయన పేరుమీద ఓ మెడికల్ కాలేజీని ఏర్పాటు చెయ్యాలి అని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: