ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం నేతలపై పోలీసులు పలు కేసులు పెట్టడాన్ని... ఇప్పుడు ఆ పార్టీ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. పదే పదే విమర్శలు చేస్తున్నారు సోషల్ మీడియాలో. టీడీపీ నేతలను అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు. తాజాగా ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై సిఎం జగన్ పై విమర్శలు చేయగా దానికి విజయసాయి రెడ్డి ఘాటుగా సమాధానం ఇచ్చారు. 

 

లోకేష్...! సొంత పెళ్ళానికి వాట్సాప్ మెసేజ్ పెట్టాలంటే.. జగన్ గారి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తోందన్నావ్. అవునా...! తీసుకుంటున్నావా...? ఎందుకయ్యా.. రాజకీయాల్లో లేని మీ ఆవిడను కూడా నీ చేతగాని మాటలతో ఈ గొడవలోకి లాగుతావ్?! అని విజయసాయి తన ట్విట్టర్ లో ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: