ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు చేసారు. తాజాగా ఆయన  మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వ విధానాలను తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కాపులకు చేసింది ఏమీ లేదని ఆయన అన్నారు. ఏ పథకం కింద లబ్ధిచేకూర్చినా సరే అది కాపులను ఉద్ధరించడానికే అని గొప్పలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. 

 

నవరత్నాలను కూడా కలిపేసి అంకెలను అమాంతం పెంచేశారని ఆయన మండిపడ్డారు. గత ప్రభుత్వం కాపు కార్పొరేషన్‌కు ఏటా రూ. 1000 కోట్లు ఇస్తామని చెప్పిందన్నారు. ప్రస్తుత పాలకులు ఏటా రూ.2 వేల కోట్లు ఇస్తామన్నారని ఆయన మండిపడ్డారు. అడిగిన వారికి కాకి లెక్కలు చెబుతున్నారన్నారు. అసలు కాపు కార్పోరేషన్ కి ఎన్ని నిధులు ఇచ్చారు, ఎవరు ఎంత కేటాయించారో చెప్పాలి అని ఆయన నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: