దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో మరోసారి పూర్తి లాక్ డౌన్ ను విధించబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. మంత్రి శ్రీరాములు కేసులు ఇలాగే పెరిగితే లాక్ డౌన్ విధిస్తామంటూ గతంలో వ్యాఖ్యలు చేశారు. 
 
వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప బెంగళూరులో మరోసారి లాక్ డౌన్ విధించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యమని..... లాక్ డౌన్ వద్దనుకుంటున్న ప్రజలంతా కరోనా నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని చెప్పారు. తమతమ నియోజకవర్గాల్లో కరోనాను కట్టడి చేసేందుకు ఎమ్మెల్యేలంతా శాయశక్తులా కృషి చేస్తారనే నమ్మకం తనకు ఉందని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: