టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అయ్యన్న ట్వీట్లో సజ్జల రెడ్డి గారూ...! ఏది అక్రమ నిర్మాణం? 43 వేల కోట్ల ప్రజాధనం లూటీ చేసి బెంగుళూరులో నిర్మించిన యలహంక ప్యాలస్, లోటస్ పాండ్ రాజ ప్రసాదం, తాడేపల్లిలో రాజ్ మహల్ సక్రమమైన నిర్మాణాలా? అని ప్రశ్నించారు. మరో ట్వీట్లో 10 ఏళ్లుగా అక్రమ నిర్మాణాల్లో ఉంటున్నారని జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 
 
ఇకనైనా మారు మనస్సు పొంది ప్రభుత్వ ఆస్తుల అమ్మకం ఆపాలని సూచనలు చేశారు. అక్రమ నిర్మాణాల్లో నివసిస్తున్న జగన్ ను ఖాళీ చేయించి ప్రభుత్వ ఖజానా పూరించాలని పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి అప్రూవర్ అయితే యువజన శ్రామిక రైతు పార్టీ మొత్తం చంచల్‌గూడా జైలుకే అని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: