అప్పటివరకు కళ్ల ముందే చెంగుచెంగున ఆడుకున్న చిన్నారి తేలు కాటుకు గురై విగతజీవిగా మారిపోయాడు. ఎంతో అపురూపంగా పెంచుకున్న కొడుకు చేతుల్లోనే ప్రాణాలు విడవటంతో తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది. ఈ విషాదకర ఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్​ మండలం దూలూరులో చోటుచేసుకుంది.తేలు కాటుకు గురై ఆరేళ్ల చిన్నారి చనిపోయిన ఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం దూలూరులో జరిగింది.

 

 

 

 గ్రామానికి చెందిన రత్నాల రాజేందర్, మానస దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆరేళ్ల వయసున్న చిన్నబ్బాయి అచ్యుత్ ఇంట్లో ఆడుకుంటుండగా... తేలు కుట్టింది. గమనించిన కుటుంబ సభ్యులు 108 వాహనంలో కోరుట్లకు తరలించే క్రమంలో మృతి చెందాడు.అప్పటివరకు ఆడుకున్న బాలుడు చూస్తుండగానే ప్రాణాలు కోల్పోవటం వల్ల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అంబులెన్సులో మార్గమధ్యలో ఆక్సిజన్ అయిపోయినట్లు స్థానికులు ఆరోపించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: