అమరావతి కరకట్ట వద్ద ప్రజా వేదికను అక్రమ నిర్మాణం అని వైయస్సార్ సిపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూల్చివేశారు. అదేవిధంగా కరకట్ట ప్రాంతంలోనే కాకుండా అనేక ప్రాంతాల్లో ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేశారు. ఇప్పుడు టిడిపి నేతలు అక్రమ నిర్మాణాలను కూల్చి వేసిన ప్రజావేదికను నిర్మిస్తామని ఆందోళన చేపడుతున్నారు.

 

 

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ కూల్చి వేసిన ప్రజా వేదిక భవనానికి సంవత్సర కాలం పూర్తి అయిన సందర్భంగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  విమర్శల వెల్లువ చేశారు. టిడిపి నేత ఉమా మహేశ్వర రావు ప్రజా వేదిక పూర్తి చేసిన స్థలానికి వెళ్లడానికి ప్రయత్నించారు.

 

 

ఈ విమర్శలకు రాజ్యసభ సభ్యుడు వైఎస్సార్ సీపీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు. ప్రజావేదిక అక్రమ నిర్మాణం కాబట్టి కూల్చి వేశామని, అదేదో మీ సొంత ఇళ్లను కూల్చి వేసినట్లుగా సంవత్సరీకాలు చేయడమేమిటని మండిపడ్డారు.

 

https://twitter.com/VSReddy_MP/status/1276689423606804480?s=19

మరింత సమాచారం తెలుసుకోండి: