ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ పై విమర్శలు సంధించారు. అవినీతి కేసులో ఎసిబి అధికారులు టిడిపి నేత అచ్చెన్నాయుడు కి కొద్దిరోజుల క్రితం అరెస్టు చేసిన విషయం అందరికి తెలిసినదే.. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా అధికారులు అచ్చెన్నాయుడు ని ప్రశ్నలు వేస్తున్నారు. ఆరోగ్యం బాగా లేదని పిటిషన్ పెట్టుకొని ఆస్పత్రిలోనే ఉంటూ చికిత్స అందిస్తూ ఏసీబీ అధికారులు తమ ప్రశ్నలను నివృత్తి చేసుకుంటూ వస్తున్నారు..

 

 

ఈ నేపథ్యంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  శ్రీకాకుళం జిల్లా వెళ్లి అచ్చెన్నాయుడు కుటుంబాన్ని పరామర్శించారు. కానీ తిరిగి వెళ్లే ప్రయాణంలో విశాఖపట్నం గ్యాస్ బాధితులను పరామర్శించకుండా హైదరాబాద్ చేరుకున్నారని.. సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. మొన్న గుంటూరు ఆస్పత్రికి అత్యవసరంగా చేరుకున్న చంద్రబాబు నాయుడు తిరిగి హైదరాబాద్ వెళ్లి పోయారు కానీ గ్యాస్ బాధితులను పరామర్శించడానికి సమయం కేటాయించలేదని ట్విట్టర్ వేదికగా విమర్శించారు. వీరికి ప్రజాధనం కొల్లగోట్టే వారే ముఖ్యమని, ప్రజలు ముఖ్యం కాదని విమర్శించారు.

 

 

https://twitter.com/SRKRSajjala/status/1276541657127636998?s=19

మరింత సమాచారం తెలుసుకోండి: