శ్రీకాకుళం జిల్లా పలాసలో కరోనా సోకినా ఒక వ్యక్తి మృతదేహాన్ని...  జేసీబీ లో తీసుకుని వెళ్లడంపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై దేశ వ్యాప్తంగా కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇది ఎంత వరకు భావ్యం అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే శానిటరీ ఇన్స్పెక్టర్ పై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. 

 

దీనిపై సిఎం వైఎస్ జగన్ స్పందించారు. శ్రీకాకుళం జిల్లా, పలాసలో కోవిడ్ మృతదేహాన్ని జేసీబీతో తరలించిన ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన  ఆవేదన వ్యక్తం చేసారు. మానవత్వాన్ని చూపాల్సిన సమయంలో కొంతమంది వ్యవహరించిన తీరు బాధించిందని అన్నారు. ఇలాంటి ఘటనలు మరెక్కడా పునరావృత్తం కాకూడదని.. బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకోకతప్పదని ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: