పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఉండి రైల్వేస్టేషన్ వద్ద రైలు కింద పడి ఒక యువకుడు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ యువకుడు గత కొన్ని రోజులుగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయితో పాటుగా తన స్నేహితుడు కూడా తనను మోసం చేసారని ఒక వీడియో రికార్డ్ చేసాడు.
ఆ తర్వాత అతను ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. ఆత్మహత్యకు ముందు సదరు వీడియో ని తన బంధువులకు పంపించాడు. తన మరణం కి కారణమైన వారిని వదిలి పెట్టవద్దు అని అతను వీడియో లో విజ్ఞప్తి చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. అతని ఫోన్ ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.