కర్నూలు జిల్లా నంద్యాల ఎస్పీవై రెడ్డి ఫ్యాక్టరీలో విష వాయువు లీక్ అయిన ఘటన సంచలనం సృష్టించింది. ఎస్పీవై రెడ్డికి చెందిన ఫ్యాక్టరీలో విషవాయువు లీక్ కావడంతో ఒకరు మరణించారు. పలువురు అస్వస్థతకు గురయ్యారు అని అధికారులు పేర్కొన్నారు. దీనితో వారు అందరిని నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

 

ఫ్యాక్టరీలో అమ్మోనియం గ్యాస్ పైప్ లీక్ అయి ఈ ప్రమాదం జరిగింది అని అధికారులు వెల్లడించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను ముమ్మరం చేసారు. గ్యాస్ లీక్ ఘటనతో అక్కడ ఉన్న స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్థానిక యంత్రాంగం వెంటనే అప్రమత్తమై౦ది. ప్రభావం తీవ్రత ఎక్కువగా ఉంటే స్థానికులను మరో ప్రాంతానికి తరలించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: