ఈ కొత్త తరానికి కొత్త ఆలోచనలతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు పరిపాలనను పరుగులు పెట్టిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ శాసన సభ డిప్యూటి స్పీకర్ కోనా రఘుపతి పేర్కొన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు. దేశం మొత్తం వలంటరీ వ్యవస్థపై చర్చ జరుగుతోందని ఆయన వివరించారు. మధ్య, దళారి లేని వ్యవస్థను జగన్ నిర్మించారని కోనా మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

 

దేశంలో ఎక్కడలేని విధంగా అర్హులైన వారందరికి ఇళ్ళ పట్టాలను అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల వాగ్దానాలను ఒక సంవత్సర కాలంలోనే పూర్తి స్థాయిలో నెరవెర్చిన ఏకైక ప్రభుత్వం తమదని ఆయన వివరించారు.. ప్రచార ఆర్భాటాలకు రాష్ట్ర ప్రభుత్వం దూరంగా ఉంటుందని కోన వ్యాఖ్యలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: