ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన వైసీపీ ఎంపీ... రఘురామ కృష్ణం రాజు కేంద్ర మంత్రులను కలిసారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ ని ఆయన కలిసారు. అనంతరం మాట్లాడుతూ... కీలక వ్యాఖ్యలు చేసారు. విజయసాయి రెడ్డి తన మీద ఎన్ని తప్పుడు రాతలు రాయించినా సరే తాను  పార్టీకి విదేయుడనే అని అన్నారు ఆయన. 

 

విజయసాయి రెడ్డి చర్యలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. వీలైతే షోకాజ్ నోటీసులను విత్ డ్రా చేసుకోవాలని సూచించారు. వాటిపై ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపైనే తాను ఆలోచిస్తున్నా అని అన్నారు. తనకు రక్షణ కల్పించిన తర్వాతే... నియోజకవర్గానికి వెళ్తా అని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: