కాపులకు వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అనే పవన్ కళ్యాణ్ విమర్శలపై మంత్రి కన్నబాబు స్పందించారు. చంద్రబాబు హయంలో పవన్ కళ్యాణ్ కి కాపులు కనపడలేదు అని ఆయన విమర్శలు చేసారు. చంద్రబాబు మీద ఉన్న ప్రేమను పవన్ దాచుకోవడం లేదని అన్నారు. ముద్రగడను చంద్రబాబు అవమానించిన సమయంలో పవన్ ఎక్కడ ఉన్నారు అని నిలదీశారు. 

 

చంద్రబాబు హయంలో పవన్ కళ్యాణ్ కి కళ్ళు కనపడలేదా...? అని నిలదీశారు. ప్రభుత్వం కాపులను ఆదుకునే ప్రయత్నం చేస్తుందని అన్నారు. కాపులపై అక్రమ కేసులు పెడితే పవన్ ఆ రోజు ఎందుకు మాట్లాడలేదని అన్నారు. విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేయడం సిగ్గు చేటు అని ఆయన మండిపడ్డారు. పవన్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని కన్నబాబు మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: