భారత్ లో కరోనా తీవ్రత నేపధ్యంలో... జనాభా ఎక్కువ కాబట్టి మందు కోసం ఎదురు చూస్తున్నారు. అయితే దీనిని క్యాష్ చేసుకోవాలని పతంజలి సంస్థ భావించింది అని పలువురు అంటున్నారు. జైపూర్ నిమ్స్ తో కలిపి తాము కరోనా మందుని తయారు చేసామని సంస్థ ప్రకటించింది. కాని అసలు మాకు ఏమీ సంబంధం లేదని  ప్రకటించారు.

 

అసలు దీనికి ఐసిఎంఆర్ నుంచి అనుమతి కూడా లేదు. దీనితో ఇప్పుడు కేంద్రం పతంజలి సంస్థపై చర్యలు తీసుకోవడం ఖాయమని పరిశీలకులు భావిస్తున్నారు. ఆ సంస్థ ప్రతీ ఒక్క దానితో కూడా వ్యాపారం చేయడం అలవాటుగా చేసుకుందని పలువురు విమర్శలు చేస్తున్నారు. ఇక ఈ మందు పై మహారాష్ట్ర సహా పలు  రాష్ట్రాలు ఆగ్రహంగా ఉన్నాయి. న్యాయపోరాటానికి సిద్దమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: