కరోనా లాంటి విపత్కర సమయంలో కూడా సిఎం కాపులకు ఆర్ధిక సహాయం చేసారని  మంత్రి కన్నబాబు అన్నారు. కాపులను మోసం చేసిన చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదు అని కన్నబాబు నిలదీశారు. కాపు నేస్తంపై పవన్ కళ్యాణ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. 

 

కాపు నేస్తం ద్వారా ఒంటరి మహిళలకు ఆర్ధిక సహాయం చేసారని పేర్కొన్నారు. కాపులకు జగన్ సర్కార్ అండగా నిలిచింది అని ఆయన చెప్పుకొచ్చారు. కాపుల కోసం ముద్రగడ ఉద్యమం చేస్తే చంద్రబాబు అణచివేసారని ఆయన ఆరోపించారు. కాపు  మహిళలపై కూడా అప్పుడు కేసులు పెట్టారని అన్నారు. పవన్ కళ్యాణ్ ఓర్వలేకపోతున్నారని మంత్రి కన్నబాబు  ఆగ్రహం వ్యక్తం చేసారు. కాపులకు తాము న్యాయం చేసామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: