ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి గాని ఆగడం లేదు. ఏపీలో  నేడు ఒక్క రోజే 796 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అంటే దాదాపు 800 కేసులు నమోదు అయ్యాయి. ఎపీకి చెందిన 740 మందికి కరోనా సోకింది. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 12 వేలు దాటింది. 12 వేల 250 మందికి కరోనా సోకింది. 

 

ఏపీలో కరోనా నుంచి 5 వేల 480 మంది కోలుకున్నారు. ఇతర దేశాలకు చెందిన 5 మందికి ఇతర రాష్ట్రాలకు చెందిన 50 మందికి కరోనా వచ్చింది. నేడు 11 మంది కరోనా మరణించారు. దీనితో మరణాల సంఖ్యా 157 కి చేరుకుంది. ఇక గత 24 గంటల్లో 24 వేల మందికి కరోనా పరిక్షలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: