ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఈఎస్ఐ అవినీతి ఏ స్థాయిలో సంచలనం సృష్టిస్తుందో అందరికి తెలిసిందే. ఈఎస్ఐ కుంభకోణం లో ఉన్న ఎవరిని వదిలేది లేదు అని స్పష్టంగా చెప్తున్నా ఏపీ సర్కార్ ఇప్పుడు అచ్చెన్నాయుడు విషయంలో కఠినం గానే వ్యవహరిస్తుంది. ఆయన విషయంలో పక్కా ఆధారాలను ఏసీబీ అధికారులు సంపాదించి విచారణ చేపట్టారు. 

 

ఇక నేడు విచారణలో కీలక అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఆయన కష్టడీ నేటి తో ముగుస్తున్న నేపధ్యంలో ఇప్పుడు కీలక విషయాలను బయటకు లాగుతున్నారు అధికారులు. ఇక ఆయన ముందు రికార్డులను పెట్టి ప్రశ్నలు అడుగుతున్నారు అని వార్తలు వస్తున్నాయి. ఇక ఆయన ఏ మాత్రం కూడా తప్పించుకునే అవకాశం లేకుండా ప్రశ్నలు అడుగుతున్నారు అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: