మరోసారి టీడీపీ నేత కూన రవి కుమార్ ఫోన్ సంభాషణ వివాదాస్పదంగా మారింది. పొందూరుకు చెందిన వైసీపీ నేత మోహన్ ను ఫోన్ లో బెదిరించారు కూన రవికుమార్. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి వైసీపీలో చేరారు ఆయన. ఆయనకు పొందూరు లో ఉన్న బిల్డింగ్ లో టీడీపీ ఆఫీస్ ఉంది. 

 

ఈ నేపధ్యంలో ఆ ఆఫీస్ ని ఖాళీ చేయించాలి అని మోహన్ కి ఒత్తిళ్ళు వస్తున్న నేపధ్యంలో కూన రవికుమార్ కి ఆయన ఫోన్ చేసారు. తన బిల్డింగ్ లోని ఆఫీస్ ని ఖాళీ చేయించాలి అని కూన రవి కుమార్ ని కోరారు. మర్యాదగా ప్రవర్తించలేదు అంటే మాత్రం మర్యాద తప్పాల్సి వస్తుంది అని కూన రవి కుమార్ హెచ్చరించారు. తేడా వస్తే లేపెస్తా అంటూ ఆయన హెచ్చరించారు. ఏం చేస్తారో చేయండి ఆఫీస్ మాత్రం ఖాళీ చెయ్యాలి అని ఆయన స్పష్టం చేసారు. దీనితో బెదిరింపుకి దిగారు కూన రవి.

మరింత సమాచారం తెలుసుకోండి: