13 నెలల్లో కాపుల కోసం తాము ఎంతో కృషి చేసామని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. కాపుల్లో వెనకబాటు తనం తగ్గించి అభివృద్ధి కోసం కృషి చేసామని ఆయన వివరించారు. కాపులకు గత 13 నెలల్లో 4 వేల 770 కోట్లను ఖర్చు చేసామని ఆయన అన్నారు. కాపులను చంద్రబాబు సర్కార్ మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. 

 

ముద్రగడ ఉద్యమాన్ని చంద్రబాబు తోక్కేసారు అంటూ అంబటి వ్యాఖ్యలు చేసారు.  అప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదు అని ఆయన నిలదీశారు. కాపు మహిళలకు సిఎం జగన్ అండగా నిలిచారని అన్నారు. కాపుల కోసం చంద్రబాబు ఏడాదికి వెయ్యి కోట్లు సహాయం చేస్తాను అని చెప్పి మాట తప్పారు అని ఆయన మండిపడ్డారు. కాపులను టీడీపీ మోసం చేసిందని ఆయన ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: