హైదరాబాద్ లో కరోనా కేసులు చుక్కలు చూపిస్తున్నాయి. కరోనా పేరు వింటే చాలు అక్కడి ప్రజలు భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. తాజాగా కరోనా కేసులు ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాలను కూడా హైదరాబాద్ లో బాగానే ఇబ్బంది పెడుతున్నాయి. అమీర్ పేట ఎమ్మార్వో కి కరోనా సోకిందని అధికారులు వెల్లడించారు. 

 

ఎమ్మార్వో చంద్రకళకు కరోనా సోకినా నేపధ్యంలో కార్యాలయ సిబ్బందిని క్వారంటైన్ కి తరలించి కార్యాలయం మొత్తం శానిటైజ్ చేస్తున్నారు. ఇటీవల అమీర్ పేట కార్పొరేటర్ శేషు కుమారికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆమెతో కలిసి చంద్రకళ పలు కార్యక్రమాల్లో పాల్గొన్న నేపధ్యంలో ఇప్పుడు ఆమెకు కూడా కరోనా వచ్చింది అని అధికారులు గుర్తించారు. ఆమె కుటుంబాన్ని కూడా క్వారంటైన్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: