దేశంలో కరోనా వైరస్ వల్ల సామాన్యులు మాత్రమే కాదు వారిని రక్షించేవారికి కూడా రక్షణ కరువైంది.  డాక్టర్లు, పోలీసులకు కరోనా వైరస్ సోకడంతో ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీలో ఇటీవ‌ల క‌రోనా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డ్డ సీఆర్‌పీఎఫ్ జ‌వాన్ మృతిచెందాడు.  ఆయ‌న వ‌య‌సు 44 ఏండ్లు. విధి నిర్వ‌హ‌ణ‌లో భాగంగా గ‌త కొంత‌కాలం నుంచి ఢిల్లీలో ఉంటున్న‌ ఆయ‌న ఇటీవ‌ల అనారోగ్యానికి గురికావ‌డంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అక్కడ కరోనా టెస్టులు చేశారు.. అయితే ఆయనకు కరోనా పాజిటీవ్ వచ్చింది.

 

అప్పటికే తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఆసుపత్రిలో చిక‌త్స పొందుతున్న ఆయ‌న ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఈ రోజు ప్రాణాలు కోల్పోయారు. శ‌నివారం మృతిచెందిన జ‌వాన్‌తో క‌లిపి సీఆర్‌పీఎఫ్‌లో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 8కి చేరింది. అదేవిధంగా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా 1,046కు చేరుకుంది. సీఆర్‌పీఎఫ్ ఉన్న‌తాధికారులు ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు.    

మరింత సమాచారం తెలుసుకోండి: