తమిళనాడు లో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. అక్కడ ఎన్ని విధాలుగా కట్టడి చేయడానికి రాష్ట్ర సర్కార్ చర్యలు తీసుకున్నా సరే వేల కేసులు పదుల సంఖ్యలో మరణాలు నమోదు అవుతూనే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా అక్కడ మరోసారి భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. 

 

తమిళనాడులో తాజాగా 3,713 కొత్త కేసులు నమోదు అయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరియు 68 మంది గత 24 గంటల్లో కరోనా కారణంగా మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 78,335కు చేరుకుంది అని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం రాష్ట్రంలో మరణాల సంఖ్య 1,025 కు చేరుకుందని తెలిపింది. క్రియాశీల కేసుల సంఖ్య 33,213 గా ఉందని ప్రభుత్వం హెల్త్ బులిటెన్ లో పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: