ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నేతలు పదే పదే వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని విమర్శలు చేస్తూ వస్తున్నారు. అయితే ఇది పద్ధతి కాదని... కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి ఆరోపించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ పదేపదే రాజారెడ్డిని అంబేద్కర్‌తో పోల్చడం సరికాదని హితవు పలికారు. 

 

దేశమంతా అంబేద్కర్‌ రాజ్యాంగం అమలవుతుంటే.. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని అనడం అంబేద్కర్‌ విలువను తగ్గించడమేనని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. దివంగత రాజారెడ్డి పులివెందుల సర్పంచ్‌ మాత్రమే అని ఆయన అన్నారు. ఆయన్ని రాష్ట్రస్థాయి నాయకుడిని చేయొద్దని తులసిరెడ్డి ఈ సందర్భంగా టీడీపీ నేతలకు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: