దేశ వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడుతున్నారు. కరోనా వైరస్ దెబ్బకు ఇప్పుడు అల్లాడిపోతున్నారు. ఈశాన్య, ఉత్తర దక్షిణ భారత దేశంలో కరోనా బారిన పడుతున్నారు ఎమ్మెల్యేలు. తాజాగా మహారాష్ట్రలో ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకి చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేకి కరోనా సోకింది. 

 

అదే జిల్లాకు చెందిన కేబినేట్ మంత్రి కరోనా నుంచి బయటపడిన కొన్ని రోజులకే ఎమ్మెల్యే కు కూడా కరోనా సోకింది. దీనిపై ఒక అధికారి మాట్లాడుతూ... ఎమ్మెల్యేకి ఓ ప్రయివేటు ఆస్పత్రిల్లో చికిత్స జరుగుతోందని అన్నారు. కరోనా వైరస్ సోకిన ఓ స్థానిక కార్పొరేటర్ నుంచి ఆయనకు కరోనా వచ్చినట్టు గుర్తించామని అన్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అసదరు అధికారి వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: