ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ కి కరోనా దెబ్బ తగిలింది. దీనితో కీలక నిర్ణయం తీసుకున్నారు చీఫ్ జస్టీస్... కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతున్న నేపధ్యంలోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తో పాటుగా మెట్రో పాలిటన్ సెషన్స్ జడ్జ్ యూనిట్ విజయవాడకు సంబంధించి న్యాయపరమైన, పరిపాలన పరమైన పనులను జూన్ 29, 30 తేదీల్లో రద్దు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసారు. 

 

ఈ ఉత్తర్వులు ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ, మెట్రో పాలిటన్ సెషన్స్ జడ్జెస్ యూనిట్‌ విజయవాడకు  వర్తిస్తాయని హైకోర్టు రిజిస్టర్ జనరల్ నోటిఫికేషన్ స్పష్ట౦ చేసారు. కాగా ఏపీలో కరోనా కేసులు నేడు ఏకంగా 800  వరకు నమోదు కావడంతో అటు రాష్ట్ర  ప్రభుత్వం కూడా జాగ్రత్త పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: