ఇంటి నిర్మాణం విషయంలో ఇరు వర్గాల మధ్య గొడవైంది. ఈ విషయపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్​కు వెళ్లారు. మాటా మాటా పెరిగి స్టేషన్ ఎదుటే మళ్లీ ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దుతో దాడి చేసుకున్నారు. ఈ ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగింది.గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఓ ఇంటి నిర్మాణం విషయంలో మొదలైన వివాదం చినికి చినికి గాలివాన అయ్యింది.

 

 

 నిర్మాణం విషయంలో ఇంటి యజమానికి, భవన నిర్మాణ కార్మికులకు మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు ఇరువురూ.. పోలీస్ స్టేషన్​కు వెళ్లారు. స్టేషన్ ఎదుటే మళ్లీ మాటా మాటా అనుకుని బాహాబాహీకి దిగారు. పిడిగుద్దులతో ఘర్షణ పడ్డారు. పోలీసులు వచ్చి వారిని చెదర గొట్టారు. కొందరిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: