రోడ్డుపై గుంతలు ఓ వ్యక్తి ప్రాణాలు తీశాయి. ఓ కుంటుంబానికి పెద్ద దిక్కు లేకుండా చేసి... ఇద్దరు కూతుళ్లకు తండ్రి లేకుండా చేశాయి. ఈ విషాదకర ఘటన యాదాద్రి భువనగరి జిల్లా వలిగొండ మండలం నర్సాపురం శివారులో జరిగింది. ద్విచక్రవాహనంపై వస్తుండగా... గుంతల కారణంగా అదుపుతప్పి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించగా.. మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి.

 

 

ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడ్డ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నర్సాపురం గ్రామ శివారులో చోటుచేసుకుంది. మృతుడు దుప్పెల్లి గ్రామానికి చెందిన జహంగీర్​గా గుర్తించారు. వాహనంపై వెనుక కూర్చున్న వ్యక్తికి గాయాలు కాగా... స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

 

జహంగీర్, భరత్ అనే వ్యక్తులు వలిగొండకు పని నిమిత్తం వెళ్లారు. తిరిగి వస్తుండగా... రోడ్డుపై గుంతల కారణంగా నర్సపురం గ్రామ శివారులో వాహనం అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది. జహంగీర్ దుప్పెల్లిలో చికెన్ దుకాణం నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నాడని పోలీసులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: