కరోనా విపత్తును ఎదుర్కోవడంలో సిఎం వైఎస్ జగన్ ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు అని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. అదే విధంగా సంక్షేమ కార్యక్రమాలను ఇచ్చిన హామీల విధంగా అమలు చేస్తున్నారన్నారు. నేడు ఉదయం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై తీవ్ర విమర్శలు చేసారు ఆమె. తిన్నది అరగక పని పాట లేకుండా లోకేష్ అవాక్కులు చవాక్కులు పేలుతున్నారని ఆమె మండిపడ్డారు. 

 

ఎమ్మెల్యేగా కూడా గెలవలేని దద్దమ్మ లోకేష్ అని ఆమె ఆరోపించారు. కరోనా సమయంలో రాష్ట్రంలో ఉండి ప్రజలకు భరోసా ఇవ్వకుండా  తండ్రి, కొడుకులు పక్క రాష్ట్రంలో దాక్కున్నారని ఆమె మండిపడ్డారు. అవినీతికి పాల్పడిన వారిని అరెస్ట్ చేస్తే మాత్రం పరామర్శించేందుకు పరుగెత్తుకొని రాష్ట్రానికి వచ్చారని ఆమె విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: