భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి నేపధ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు. “భారత మాజీ ప్రధాని, తెలుగు బిడ్డ శ్రీ పీవీ నరసింహారావు గారి జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. సాహితీవేత్తగా, సామాజికవేత్తగా, రాజనీతిజ్ఞుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా బహుభాషా కోవిదుడిగా వారు చేసిన కృషి చిరస్మరణీయం.
భారతీయ భాషల అభివృద్ధికోసం వారి తపన, ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండేలా తీసుకున్న చర్యలు, అధికార భాషా సంఘం, తెలుగు అకాడమీ ఏర్పాటులో తీసుకున్న చొరవ ప్రశంసనీయం. వారి నిరాడంబర జీవితం ఆదర్శనీయం. ప్రతిష్టాత్మక ‘వేయిపడగలు’ నవలను హిందీలోకి అనువదించడమే కాకుండా.. పలు తెలుగు కవితాసంపుటాలను ఆంగ్లంలోకి అనువదించారు. తెలుగుదనానికి ప్రతీకైన శ్రీ పీవీ నరసింహారావు గారి స్మృత్యర్థం.. ఏడాదిపొడగునా వారి శతజయంతి ఉత్సవాలను జరపాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం అభినందనీయం.” అంటూ వెంకయ్య ట్వీట్ చేసారు.
భారత మాజీ ప్రధాని, తెలుగు బిడ్డ శ్రీ పీవీ నరసింహారావు గారి జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. సాహితీవేత్తగా, సామాజికవేత్తగా, రాజనీతిజ్ఞుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా బహుభాషా కోవిదుడిగా వారు చేసిన కృషి చిరస్మరణీయం. #PVNarasimhaRao pic.twitter.com/lzrd5ht9IY
— Vice President of india (@VPSecretariat) June 28, 2020
క్లిష్ట పరిస్థితుల్లో ప్రధాని పీఠాన్ని అధిరోహించినా సమర్థతను ప్రదర్శించి ఆర్థిక సంస్కరణలకు రాచబాట వేశారు. సమైక్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, వివిధ శాఖలకు మంత్రిగా విద్య, భూ సంస్కరణల కోసం వారు తీసుకున్న చొరవ చాలా గొప్పది. #PVNarasimhaRao
— Vice President of india (@VPSecretariat) June 28, 2020