దేశంలో కరోనా తీవ్రత విశ్వరూపం చూపిస్తుంది. వేల కేసులు నమోదు అవుతున్నాయి. రోజుల వ్యవధిలో లక్షల కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి గాని ఏ మాత్రం కూడా కేసులు ఆగడం లేదు. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 19 వేల 906 కరోనా కేసులు 410 మరణాలు నమోదు అయ్యాయి. 

 

మొత్తం కరోనా కేసులు 5 లక్షల 28 వేల 859 నమోదు అయ్యాయి. మరణాలు 16 వేలు దాటాయి. ఒక్క రోజులోనే దాదాపు 20 వేల కేసులు నమోదు అయ్యాయి అంటే కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 16 వేల 95 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు అని కేంద్రం హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. యాక్టివ్ కేసులు రెండు లక్షలు దాటాయి దేశంలో.

మరింత సమాచారం తెలుసుకోండి: