దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. నిన్న ఒక్క రోజే దాదాపుగా 20 వేల కరోనా కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల్లో 19 వేల 906 కరోనా కేసులు 400 పైగా మరణాలు సంభవించాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే కరోనా పరీక్షలను కూడా వేగవంతం చేస్తుంది కేంద్రం. 

 

జూన్ 27 వరకు పరీక్షించిన మొత్తం 82,27,802 మందికి కరోనా పరిక్షలు చేసారు. వీటిలో 2,31,095 నమూనాలను నిన్న పరీక్షించారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర లో ఎక్కువగా కరోనా పరిక్షలు చేస్తున్నారు. ఇక తమిళనాడు లో కూడా అదే స్థాయిలో చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: