ఒక పక్క దేశంలో కరోనా కేసులు పెరుగుతూ ఉంటే మరో పక్క... సైనికుల్లో కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. రోజు రోజుకి సైనికికుల్లో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. పదుల సంఖ్యలో సైనికులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా మరో 33 మంది సైనికులు కరోనా బారిన పడ్డారు. 

 

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్ఎఫ్) కి చెందిన 33 మంది సిబ్బంది గత 24 గంటల్లో కరోనా బారిన పడ్డారు అని అధికారులు వెల్లడించారు. 637 మంది సైనికులు కరోనా నుంచి పూర్తిగా కోలుకుని బయటపడ్డారు. 5 మంది సైనికులు కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇక మొత్తం కేసుల సంఖ్య చూస్తే 944 కు  చేరుకుంది అని అధికారులు వెల్లడించారు. క్రియాశీల కేసుల సంఖ్య 302 గా ఉందని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: