మిడతలు... ఈ పధం ఉత్తరాది రాష్ట్రాలను షేక్ చేస్తుంది. మిడతల పేరు వింటే చాలు అక్కడి ప్రజలు భయపడుతున్నారు. హర్యానా రాజస్థాన్ సహా కొన్ని రాష్ట్రాలు మిడతల దెబ్బకు అల్లాడిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ లో మిడతల తీవ్రత ఎక్కువగా ఉంది. ఢిల్లీ సర్కార్ ఎన్ని విధాలుగా వాటిని కట్టడి చేయడానికి ప్రయత్నాలు చేసినా సరే అవి ఆగడం లేదు. 

 

ఇక ఇదిలా ఉంటే... మిడతలను డ్రోన్ ల ద్వారా తరిమి కొట్టిన దేశం భారత్ అని వ్యవసాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. డ్రోన్ల సాయంతో మిడతల దండును నిరోధించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక ప్రోటోకాల్‌ను అమలు చేస్తోందని  తాజాగా ఒక ప్రకటనలో పేర్కొంది. మిడతలను రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు గమనిస్తున్నాయని, వాటి ప్రభావం తగ్గిస్తామని చెప్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: